ఎకనామిక్ కారిడార్ ను ప్రకటించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- September 10, 2023
న్యూఢిల్లీ: భారతదేశాన్ని మిడిల్ ఈస్ట్, యూరప్తో కలిపే ఆర్థిక కారిడార్ ప్రాజెక్ట్ కోసం సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక కనెక్టివిటీని మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, యు అప్గ్రేడ్ చేయడం, ప్రమేయం ఉన్న పార్టీల మధ్య వాణిజ్యాన్ని పెంచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని వెల్లడించారు. శనివారం ఢిల్లీలో జరిగిన G20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ మాట్లాడుతూ.. “ఈ స్నేహపూర్వక దేశంలో ఆర్థిక కారిడార్ కోసం ఎంఓయూపై సంతకం చేయడానికి మేము ఈ రోజు సమావేశమైనందుకు నేను సంతోషిస్తున్నాను. భారతదేశాన్ని మిడిల్ ఈస్ట్ మరియు యూరప్తో కలిపే ప్రాజెక్ట్ ఇది.’’ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ రైల్వేలు, పోర్ట్ కనెక్షన్లు మరియు వస్తు సేవలను పెంచడంతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధి, అప్గ్రేడ్కు దోహదం చేస్తుందన్నారు. తద్వారా భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







