G20 సమ్మిట్: మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రపంచ నేతలు

- September 10, 2023 , by Maagulf
G20 సమ్మిట్: మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రపంచ నేతలు

న్యూఢిల్లీ: ఆదివారం ఉదయం న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి ప్రపంచ అగ్రనేతలు నివాళులర్పించారు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అతిథులకు 'అంగ్రాఖా' (బాహ్య వస్త్రం) తో స్వాగతం పలికారు. గాంధీకి నివాళులు అర్పించిన వారిలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, ఇటాలియన్ పైమ్ మంత్రి జార్జియా మెలోని, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్, IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా ఉన్నారు. రెండు రోజుల G20 సదస్సు శనివారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. మొదటిరోజు ఢిల్లీ డిక్లరేషన్‌ను నేతలు ఆమోదించారు. ఈ సమావేశంలో యూఏఈ, సౌదీ అరేబియా మరియు యూరప్ ద్వారా భారతదేశాన్ని యుఎస్‌కి అనుసంధానించే ఓడరేవు, రైలు కనెక్టివిటీని ప్రారంభించడం మరియు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జి20లో శాశ్వత సభ్యదేశంగా చేరాల్సిందిగా ఆఫ్రికన్ యూనియన్‌ను భారత్ ఆహ్వానించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com