సోమాలియాలో యు.ఏ.ఈ సహాయక దళాలు లక్ష్యంగా జరిగిన దాడిలో 6గురి మృతి
- June 25, 2015
సోమాలియా రాజధాని మొగదిషూలో ఈ బుధవారం యు.ఏ.ఈ సహాయక దళాలు లక్ష్యంగా అల్ షాబాబ్ తీవ్రవాద సంస్థ ఆత్మాహుతిదళ సభ్యుడు తన కారుతో, సహాయకదళ పికప్ ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు వ్యక్తులు మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు. కాగా, సోమాలియా పోలీసు అధికారి అబ్డుకాదీర్ హస్సన్, యు.ఎ. ఇ. అధికారులెవరు ఈ దాడిలో గాయపడలేదని స్పష్టం చేశారు.
సోమాలియాలో యు.ఎ.ఇ. దళాలు రక్షణ, మౌలికవసతి, అభివృద్ధి ప్రోజక్టులు ఇంకా అనేక సహాయక చర్యలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ ఘటనపై యు.ఎ. ఇ. విదేశీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి డా. అన్వర్ మొహమ్మద్ గార్గాష్ ఈ తీవ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







