సోమాలియాలో యు.ఏ.ఈ సహాయక దళాలు లక్ష్యంగా జరిగిన దాడిలో 6గురి మృతి
- June 25, 2015
సోమాలియా రాజధాని మొగదిషూలో ఈ బుధవారం యు.ఏ.ఈ సహాయక దళాలు లక్ష్యంగా అల్ షాబాబ్ తీవ్రవాద సంస్థ ఆత్మాహుతిదళ సభ్యుడు తన కారుతో, సహాయకదళ పికప్ ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు వ్యక్తులు మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు. కాగా, సోమాలియా పోలీసు అధికారి అబ్డుకాదీర్ హస్సన్, యు.ఎ. ఇ. అధికారులెవరు ఈ దాడిలో గాయపడలేదని స్పష్టం చేశారు.
సోమాలియాలో యు.ఎ.ఇ. దళాలు రక్షణ, మౌలికవసతి, అభివృద్ధి ప్రోజక్టులు ఇంకా అనేక సహాయక చర్యలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ ఘటనపై యు.ఎ. ఇ. విదేశీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి డా. అన్వర్ మొహమ్మద్ గార్గాష్ ఈ తీవ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







