యూఏఈలో అక్టోబర్ 1 నుంచి భారీ వాహనాల పై నిషేధం

- September 14, 2023 , by Maagulf
యూఏఈలో అక్టోబర్ 1 నుంచి భారీ వాహనాల పై నిషేధం

యూఏఈ: రహదారి వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి..  రహదారి సమగ్రతను కాపాడేందుకు యూఏఈ ఫెడరల్ ప్రభుత్వం జాతీయ రహదారుల వెంట ప్రయాణించగల భారీ వాహనాల గరిష్ట అనుమతించదగిన బరువును 65 టన్నులుగా నిర్ణయించింది. సెప్టెంబర్ 4న ప్రకటించిన కొత్త ఫెడరల్ చట్టం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయినప్పటికీ ఫిబ్రవరి 1, 2024 నుండి అడ్మినిస్ట్రేటివ్ పెనాల్టీలు అమలులోకి వచ్చే ముందు కొత్త చట్టానికి అనుగుణంగా భారీ వాహనాల యజమానులు,  కంపెనీలకు నాలుగు నెలల గ్రేస్ పీరియడ్‌ ను ఇంధనం, మౌలిక సదుపాయాల మంత్రి సుహైల్ బిన్ మొహమ్మద్ అల్ మజ్రోయి తెలిపారు. యూఏఈలో మౌలిక సదుపాయాలు, రవాణా మరియు లాజిస్టిక్స్ రంగాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ చట్టం పనిచేయనుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన వాటిలో ఒకటిగా యూఏఈ ఉండేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునిస్తుందని వివరించారు. సరిహద్దు దాటే ట్రక్కులతో సహా 150,000 భారీ వాహనాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయని అల్ మజ్రోయి తెలిపారు. భద్రత, మిలిటరీ, పోలీసు మరియు పౌర రక్షణ అధికారుల యాజమాన్యంలోని భారీ వాహనాలకు చట్టం నుండి మినహాయింపు ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ట్రక్కుల్లో 28 శాతం 65 టన్నులకు మించి ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అక్టోబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 వరకు ఉన్న నాలుగు నెలల గ్రేస్ పీరియడ్‌ని రవాణా సంస్థల్లో చట్టంపై అవగాహన పెంచేందుకు వినియోగిస్తామని పేర్కొన్నారు. నాలుగు నెలల వ్యవధిలో యూఏఈ జాతీయ రహదారులపై స్మార్ట్ గేట్లను కూడా ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ ఇ-గేట్‌లలో హై-రిజల్యూషన్ మానిటరింగ్ కెమెరాలు (నిరూపితమైన 98% ఖచ్చితత్వంతో), 3డి లేజర్ స్కానర్‌లు మరియు ఎలక్ట్రానిక్ సెన్సార్ల ఏర్పాటు ఉంటుందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com