భిక్షాటన ముఠాగుట్టును బట్టబయలు చేసిన ఖతార్ అధికారులు
- September 15, 2023
దోహా: మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ దాడులు ఉధృతం చేసింది. భిక్షాటన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అరెస్టు చేసింది. సదరు ముఠాలో ఉన్నవారు ఆసియా దేశానికి చెందిన వారని అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో భిక్షాటన చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేయడం కనిపించింది. వారి నుంచి నగదు, పాస్పోర్టులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. "మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా స్వప్రయోజనాల కోసం యాచించడం కోసం ప్రజలను దోపిడీ చేయడంలో పాల్గొన్న ఒక ఆసియా దేశానికి చెందిన వ్యక్తులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసింది" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పట్టుబడిన వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







