పురందేశ్వరి చేతుల మీదుగా అక్కినేని నాగేశ్వరరావు సెంటినరీ అవార్డ్స్ పోస్టర్ ఆవిష్కరణ
- September 15, 2023
విజయవాడ: దివంగత నటులు అక్కినేని నాగేశ్వర రావు శతజయంతిని పురస్కరించుకొని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు సినీ రంగంతో పాటు వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని ఏ.ఎన్.ఆర్ సెంటినరీ పాన్ ఇండియా అవార్డ్స్ పేరిట ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ ఆడిటోరియం లో సత్కరించనున్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శతజయంతి వేడుక పోస్టర్ ని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి విజయవాడలో ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగే ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేయనున్న పురందేశ్వరి మాట్లాడుతూ తనకు బాబాయి వంటి మహానటులు అక్కినేని గారి శతజయంతి వేడుకకు ఆహ్వానించడం చాలా ఆనందంగా వుంది.దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అందించే ఈ సత్కారం మేధావి అయిన బాబాయికి నిజమైన నివాళి అని అన్నారు. ఎఫ్.టి.పీ.సీ ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సుపరిచుతులైన ఏ.ఎన్.ఆర్ వేడుకను పాన్ ఇండియా స్థాయిలో నిర్వహిస్తున్నామని , ఈ వేడుక నిర్వహించడాన్ని ఓ ఛాలెంజ్ గా తీసుకొని బహు రాష్ట్రాల సినీ సామాజిక రంగలవారిని సత్కరించనున్నామని అన్నారు. తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు వీస్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ మూల స్తంబాలలో ఒకరైన అక్కినేని శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణ మరియు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పాతూరు నాగభూషణం, డాక్టర్ రాంచంద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









