యూఏఈలో వాట్సాప్ స్కామ్.. నివాసితులకు అలెర్ట్ జారీ

- September 16, 2023 , by Maagulf
యూఏఈలో వాట్సాప్ స్కామ్.. నివాసితులకు అలెర్ట్ జారీ

యూఏఈ: యూఏఈ నివాసితులు స్కామర్‌ల బారీన పడకుండా అధికారులు హెచ్చరించారు. ఇటీవల ఒక స్కామర్ బాధితుడికి వాట్సాప్‌లో 'సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ' నుండి 'లీగల్ నోటీసు' అంటూ స్కామ్ మెసేజ్ పంపాడు.  దానిని నిశితంగా పరిశీలిస్తే అది నకిలీదని చెప్పడం చాలా సులభం. 'చట్టపరమైన నోటిఫికేషన్‌లు' పేరుతో ఉన్న పత్రంలో కొన్ని స్పష్టమైన స్పెల్లింగ్ లోపాలు ఉన్నాయి. "క్షమించండి, ప్రియమైన కస్టమర్ మీ బ్యాంక్ ఖాతా (ATM, డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు) కొన్ని భద్రతా కారణాల వల్ల స్తంభింపజేయబడుతుంది. మీ అన్ని సరైన వివరాలను ధృవీకరించండి. లేకపోతే మీ ఖాతా శాశ్వతంగా నిలిపివేయబడుతుంది." అని వచ్చింది. పైగా ఇందులో కాంటాక్ట్ నెంబర్ కూడా వెల్లడించారు. ఇలాంటి స్కామ్‌లు చాలా తరచుగా జరుగుతుంటాయని, మోసగాళ్ళు యూఏఈ అధికారుల వలె నటించి, బాధితుల బ్యాంక్ వివరాలను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల రస్ అల్ ఖైమా పోలీసులు నివాసితుల బ్యాంకు ఖాతాల నుండి భారీ మొత్తంలో డబ్బును దొంగిలిస్తున్న మోసగాళ్ల ముఠాను పట్టుకున్నట్లు భద్రతాధికారులు తెలిపారు.   ఖాతాల అప్‌డేట్ నెపంతో ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్స్ లేదా ఫోన్ కాల్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించమని బ్యాంకులు కస్టమర్లను అడుగుతారని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను ఎదుర్కొన్నట్లయితే, వెంటనే వాటిని అధికారులకు తెలియజేయాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com