23న ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ కమిటీ తొలి సమావేశం
- September 16, 2023
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ విధానాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరుగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించనున్నారు. దీని కోసం రాజ్యాంగంలో చేయాల్సిన సవరణలు, సంబంధిత చట్టాల్లో మార్పులను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు.
కాగా, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికల విధానాన్ని పరిశీలించేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారు. న్యాయ వ్యవహారాల కార్యదర్శి నితేన్ చంద్ర ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









