ఇండియా-శ్రీలంక ఆసియా కప్ 2023 ఫైనల్: దుబాయ్లో ఎక్కడ చూడొచ్చంటే..?
- September 17, 2023
యూఏఈ: ఆసియా కప్ టోర్నమెంట్లో ఉత్కంఠభరితమైన ఫైనల్ను చూసేందుకు యూఏఈ వాసులు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 17న ఇండియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. యూఏఈ సమయం ప్రకారం.. మద్యాహ్నం ఒంటిగంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఎక్కడ చూడొచ్చు
దుబాయ్ లో ఆసియా కప్ ను చూసేందుకు కొన్ని సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. వివరాల్లోకి వెళితే..
1. హడిల్
దుబాయ్లోని ప్రముఖ స్పోర్ట్స్ బార్. గేమ్ చూస్తూ రుచికరమైన ఏదైనా తినాలనుకునే వారి కోసం వారు ఆహారం మరియు పానీయాలతో కూడిన ఫిక్స్డ్ మెనూని అందిస్తారు. మీరు 050 100 7065కు కాల్ చేయడం ద్వారా ముందుగానే సీటును రిజర్వ్ చేసుకోవచ్చు.
2. ఫ్లయింగ్ క్యాచ్
ఏస్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పోర్ట్స్ రెస్టారెంట్లో ఆరు LED స్క్రీన్లు, భారీ 200cm జెయింట్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. జుమేరా 1లో ఉన్న ఫ్లయింగ్ క్యాచ్ బఫే-శైలి ఎంపికలను ఒక్కొక్కరికి Dh149, వారి మెనూలో ఐటమ్స్ పై 20 శాతం తగ్గింపును ప్రకటించారు.
3. TJ లు
ఆసియా కప్ కోసం క్రికెట్ ఔత్సాహికులు తాజ్ జుమేరా లేక్స్ టవర్స్లోని TJలకు వెళ్లవచ్చు. కొన్ని గొప్ప మ్యాచ్-అవర్ డీల్లను అందిస్తుంది. అన్ని పానీయాలపై 50 శాతం తగ్గింపుతోపాటు మెయిన్ కోర్సు Dh99 నుంచి ప్రారంభం అవుతున్నది.
తాజా వార్తలు
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది







