స్మార్ట్‌ పోన్‌ దొంగలపై ఛార్జ్‌ షీట్‌

- May 20, 2016 , by Maagulf
స్మార్ట్‌ పోన్‌ దొంగలపై ఛార్జ్‌ షీట్‌

 

ఓ మొబైల్‌ ఫోన్‌ కంపెనీకి చెందిన వాహనం అద్దాలు ధ్వంసం చేసి, 190,000 దిర్హామ్‌లు విలువైన మొబైల్‌ ఫోన్లను దొంగలించిన కేసులో ఇద్దరు వ్యక్తులపై చార్జ్‌షీట్‌ నమోదయ్యింది. నిందితుల్ని పాకిస్తాన్‌కి చెందినవారుగా గుర్తించారు. వాహనం పార్క్‌ చేసిన ఉన్న సమయంలో ఈ దొంగతనం జరిగింది. మొత్తం 176 మొబైల్‌ ఫోన్లను నిందితులు దొంగిలించారు. దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు న్యాయస్థానం ముందు అంగీకరించారు. విచారణ సందర్భంగా తాము దొంగిలించిన సామాగ్రి విలువ 34,000 దిర్హామ్‌లు మాత్రమేనని న్యాయమూర్తితో నిందితులు చెప్పారు. న్యాయమూర్తి నిందితుల తరఫున ఇద్దరు లాయర్లను నియమించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com