స్మార్ట్ పోన్ దొంగలపై ఛార్జ్ షీట్
- May 20, 2016
ఓ మొబైల్ ఫోన్ కంపెనీకి చెందిన వాహనం అద్దాలు ధ్వంసం చేసి, 190,000 దిర్హామ్లు విలువైన మొబైల్ ఫోన్లను దొంగలించిన కేసులో ఇద్దరు వ్యక్తులపై చార్జ్షీట్ నమోదయ్యింది. నిందితుల్ని పాకిస్తాన్కి చెందినవారుగా గుర్తించారు. వాహనం పార్క్ చేసిన ఉన్న సమయంలో ఈ దొంగతనం జరిగింది. మొత్తం 176 మొబైల్ ఫోన్లను నిందితులు దొంగిలించారు. దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు న్యాయస్థానం ముందు అంగీకరించారు. విచారణ సందర్భంగా తాము దొంగిలించిన సామాగ్రి విలువ 34,000 దిర్హామ్లు మాత్రమేనని న్యాయమూర్తితో నిందితులు చెప్పారు. న్యాయమూర్తి నిందితుల తరఫున ఇద్దరు లాయర్లను నియమించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







