జ్యుయెలరీ దొంగల ముఠా పట్టివేత
- May 20, 2016
ఏడుగురు సభ్యులు గల దొంగల ముఠాపై పోలీసు అధికారులు కేసులు నమోదు చేసి, ట్రయల్కి తరలించారు. ఈ ముఠాలో ఐదుగురు కొలంబియన్స్, ఇద్దరు సుడానీస్ ఉన్నారు. విల్లాలను దొంగతనం చేయడంలో వీరు దిట్ట. విల్లాల్లో ఎవరూ లేని సమయం చూసి, ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతుంది. జుమైరాలోని ఓ పాకిస్తానీ మహిళకు చెందిన విల్లాపై కన్నేసిన దుండగులు, ఆ విల్లాపై దాడి చేశారు. విలువైన వస్తువుల్ని, నగదుని దొంగలించారు. కేసు విచారించిన పోలీసులు దొంగల ముఠాని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు దొంగల్ని గుర్తించారు. దొంగలంతా నిరుద్యోగులుగా పోలీసులు తేల్చారు. అజ్మన్లోని ఓ స్టోర్లో దొంగతనానికి అవసరమైన వస్తువుల్ని దుండుగులు కొనుగోలు చేశారని పోలీసు అధికారి వివరించారు. దొంగిలించిన వస్తువుల విలువ 1,055,000 దిర్హామ్లు అని పోలీసులు వివరించారు. ఈ కేసులో తీర్పు జూన్ 13న వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







