వేములవాడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బస్సు ప్రారంభం
- September 23, 2023
తెలంగాణ: వేములవాడ ఆర్టీసీ డిపో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు డీలక్స్ బస్సును స్థానిక బస్టాండ్ లో శుక్రవారం రాజన్న ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు.డిపో మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ వేములవాడ నుంచి డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 04:30 గంటలకు బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాత్రి 09:00 గంటలకు చేరుకుంటుందన్నారు.మళ్లీ మరుసటి రోజు ఉదయం 05:30 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వేములవాడకు 10:00 గంటలకు చేరుకుంటుందని వివరించారు.ఒక్కరికి టికెట్ రూ.500 ఉంటుందని తెలిపారు.ఎస్బిఐ వర్జీలాల్,రామచందర్,సత్యనారాయణ,రాం రెడ్డి,శిరీష,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరో వారం పాటు ఈ బస్సు సౌకర్యం చూసి బస్సు బయల్దేరే సమయం మారుస్తామని TSRTC అధికారి పి.జీవన్ ప్రసాద్ మాగల్ఫ్ కు తెలిపారు.


తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









