8 నెలల్లో 107 రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి
- September 23, 2023
యూఏఈ: దుబాయ్లో గత ఎనిమిది నెలల్లో మొత్తం 107 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, దీని ఫలితంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, 75 మంది వివిధ గాయాలకు గురయ్యారని దుబాయ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం జిగ్ జాగ్ డ్రైవింగ్ అని దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రూయి పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుండి ఆగస్టు వరకు దుబాయ్ పోలీసుల స్మార్ట్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్లు మరియు రాడార్ల ద్వారా 529,735 లేన్ ఉల్లంఘనలు నమోదయ్యాయని ఆయన తెలిపారు.
400 దిర్హామ్ జరిమానా
వాహనదారులు తప్పనిసరి లేన్కు కట్టుబడి ఉండాలని, లేదంటే Dh400 జరిమానా విధించబడుతుందని ఆయన చెప్పారు. బస్సులు, ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా లేన్లు ఉన్నాయని, అలాగే నిర్దిష్ట రకాల వాహనాల కోసం కొన్ని లేన్లు ప్రత్యేకంగా ఉన్నాయని, ఈ ప్రత్యేక లేన్లను ఉపయోగించే వాహనదారులకు కూడా జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









