పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు..
- September 25, 2023
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర నాలుగో విడత షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1 నుంచి కృష్ణా జిల్లా లోని అవనిగడ్డ నుంచి పవన్ యాత్రను ప్రారంభించనున్నారు. అక్టోబర్ 6వతేదీ వరకు యాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వారాహి యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పొత్తు ప్రకటన తరువాత తొలిసారి ప్రజల్లోకి పవన్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో పవన్ వారాహి యాత్రపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నారు. రెండు రోజులు సీఐడీ అధికారులు బాబును జైలులో విచారించారు. అయితే, చంద్రబాబు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో లోకేశ్, బాలకృష్ణలతో కలిసి పవన్ ములాఖత్ అయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన పవన్.. వచ్చేఅ సెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని ప్రకటించారు.
కొద్దికాలంగా టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే విషయంపై ఏపీ రాజకీయాల్లో సందిగ్దతకు పవన్ తెరదించారు. అయితే, టీడీపీ, జనసేన పార్టీల పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత తొలిసారి పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. దీంతో పవన్ ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పవన్ మూడో విడత వారాహి యాత్ర వరకు కేవలం జనసేన పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులు యాత్రలో పాల్గొన్నారు. ఈసారి టీడీపీ శ్రేణులుసైతం పవన్ వారాహి యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







