హైదరాబాద్ లో లులు మాల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- September 27, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో మరో మాల్ అందుబాటులోకి వచ్చింది. కుకట్ పల్లిలోని కేబీహెచ్ బీ కాలనీలోని సరికొత్త మాల్ అందుబాటులోకి వచ్చింది. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన లులు మాల్ ను మంత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ ఎంఏ పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలో ఎన్నో మాల్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దేని ప్రత్యేకత దానిదే. అటువంటి నగరంలోకి లులు వచ్చి చేరింది. ఈ మాల్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతోందని సంస్థ ప్రతినిధుతు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేబీహెచ్ బిలో ప్రారంభమైన ఈ మాలత్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లులు మాల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభమైనట్లు అయ్యింది.

దాదాపు ఐదు లక్షల చదరపు విస్త్రీర్ణంలో ఉండే ఈ లులు మాల్.. రెండు లక్షల చదరపు అడుగుల హైపర్ మార్కెట్తోపాటు అత్యంత అధునాతన గ్లోబల్ రిటెయిల్ షాపింగ్ అనుభవాన్ని అందినుంది. నగరంలో కూకట్పల్లి ప్రాంతమంటే అదో జనారణ్యమనే చెప్పాలి. ఎప్పుడు అంత్యం రద్దీగా ఉండే కుకట్ పల్లి ఏరియాలో ప్రారంభమైన ఈ మెగా షాపింగ్ మాల్ నగరవాసులను ఆకట్టుకోనుంది. ఈ లులు మాల్ ప్రారంభంతో తెలంగాణలో లులు గ్రూప్కి ఇది మొదటి వెంచర్ అని చెప్పాలి. 2022లో మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా జరిగిన ఒప్పందంలో భాగంగా తెలంగాణలో భారీ పెట్టుబడుల హామీలో భాగంగా ఈ మాల్ ఏర్పాటు అయ్యింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







