జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- October 01, 2023
కువైట్: కువైట్లోని KGL గ్రూప్కు చెందిన మాజీ డిప్యూటీ గ్రూప్ CFO విశ్వనాథ్ పిచుమోనీ జింబాబ్వేలో ఒక ప్రైవేట్ విమానం ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. విశ్వనాథ్ KGL గ్రూప్ CFO గా కువైట్లో పనిచేసారు. అతను ప్రస్తుతం భారతదేశంలోని హైదరాబాద్లో ఉంటున్నారు. విశ్వనాథ్ హరారేలో తాత్కాలికంగా ఇటీవల ఉద్యోగంలో చేరారు. అతను, మరో ఐదుగురితో కలిసి డైమండ్ మైనర్ రియో జిమ్కు చెందిన సెస్నా 206 విమానంలో హరారే నుండి జ్విషావనేలోని మురోవా డైమండ్స్ మైన్కి వెళ్తున్నాడు. రియో జింబాబ్వే కంపెనీకి చెందిన ప్రైవేట్ విమానం. ఉదయం 8 గంటల ప్రాంతంలో కూలిపోయే ముందు సాంకేతిక సమస్య తలెత్తిందని, అందులో ఉన్న ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ మరణించారని అనుమానిస్తున్నారు. విశ్వనాథ్ భార్య ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీమతి మాలినీ విశ్వనాథ్. ప్రస్తుతం వారు వేరుగా ఉంటున్నారు. ఆమె కువైట్లో రాగ్ ఎన్'రిథమ్ వ్యవస్థాపకురాలు. వీరి కుమార్తె రాఘవి విశ్వనాథ్ నెదర్లాండ్స్లో, కుమారుడు రాఘవ చదువుతున్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









