జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- October 01, 2023
కువైట్: కువైట్లోని KGL గ్రూప్కు చెందిన మాజీ డిప్యూటీ గ్రూప్ CFO విశ్వనాథ్ పిచుమోనీ జింబాబ్వేలో ఒక ప్రైవేట్ విమానం ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. విశ్వనాథ్ KGL గ్రూప్ CFO గా కువైట్లో పనిచేసారు. అతను ప్రస్తుతం భారతదేశంలోని హైదరాబాద్లో ఉంటున్నారు. విశ్వనాథ్ హరారేలో తాత్కాలికంగా ఇటీవల ఉద్యోగంలో చేరారు. అతను, మరో ఐదుగురితో కలిసి డైమండ్ మైనర్ రియో జిమ్కు చెందిన సెస్నా 206 విమానంలో హరారే నుండి జ్విషావనేలోని మురోవా డైమండ్స్ మైన్కి వెళ్తున్నాడు. రియో జింబాబ్వే కంపెనీకి చెందిన ప్రైవేట్ విమానం. ఉదయం 8 గంటల ప్రాంతంలో కూలిపోయే ముందు సాంకేతిక సమస్య తలెత్తిందని, అందులో ఉన్న ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ మరణించారని అనుమానిస్తున్నారు. విశ్వనాథ్ భార్య ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీమతి మాలినీ విశ్వనాథ్. ప్రస్తుతం వారు వేరుగా ఉంటున్నారు. ఆమె కువైట్లో రాగ్ ఎన్'రిథమ్ వ్యవస్థాపకురాలు. వీరి కుమార్తె రాఘవి విశ్వనాథ్ నెదర్లాండ్స్లో, కుమారుడు రాఘవ చదువుతున్నారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







