జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- October 01, 2023
కువైట్: కువైట్లోని KGL గ్రూప్కు చెందిన మాజీ డిప్యూటీ గ్రూప్ CFO విశ్వనాథ్ పిచుమోనీ జింబాబ్వేలో ఒక ప్రైవేట్ విమానం ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. విశ్వనాథ్ KGL గ్రూప్ CFO గా కువైట్లో పనిచేసారు. అతను ప్రస్తుతం భారతదేశంలోని హైదరాబాద్లో ఉంటున్నారు. విశ్వనాథ్ హరారేలో తాత్కాలికంగా ఇటీవల ఉద్యోగంలో చేరారు. అతను, మరో ఐదుగురితో కలిసి డైమండ్ మైనర్ రియో జిమ్కు చెందిన సెస్నా 206 విమానంలో హరారే నుండి జ్విషావనేలోని మురోవా డైమండ్స్ మైన్కి వెళ్తున్నాడు. రియో జింబాబ్వే కంపెనీకి చెందిన ప్రైవేట్ విమానం. ఉదయం 8 గంటల ప్రాంతంలో కూలిపోయే ముందు సాంకేతిక సమస్య తలెత్తిందని, అందులో ఉన్న ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ మరణించారని అనుమానిస్తున్నారు. విశ్వనాథ్ భార్య ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీమతి మాలినీ విశ్వనాథ్. ప్రస్తుతం వారు వేరుగా ఉంటున్నారు. ఆమె కువైట్లో రాగ్ ఎన్'రిథమ్ వ్యవస్థాపకురాలు. వీరి కుమార్తె రాఘవి విశ్వనాథ్ నెదర్లాండ్స్లో, కుమారుడు రాఘవ చదువుతున్నారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







