చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు 25 ఏళ్లు.. ‘మహాత్మకు ఇదే మన నివాళి’ - మెగాస్టార్ చిరంజీవి
- October 02, 2023
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో హీరోగా అగ్రస్థాయికి చేరుకున్నారు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇక అదే స్థాయిలో సేవా కార్యక్రమాలనూ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలో 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. దీనితోపాటు చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్స్ ను స్థాపించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ బ్యాక్ చాలా పెద్దది. అయితే గాంధీ జయంతి రోజునే ఈ బ్లడ్ బ్యాంక్ ను స్థాపించడం విశేషం. నేటితో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తైంది.
ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఆసక్తికరమైన నోట్ విడుదల చేశారు. ట్వీట్ లో.. మన దేశానికి ఇది ముఖ్యమైన రోజు. నేను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సిసిటి) ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తైంది. అద్భుతమైన ప్రయాణం ట్రస్ట్ పై ప్రేమను ప్రతిబింబిస్తోంది. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి పేదలకు అందించాం. కంటి పంపిణీ ద్వారా 10 వేల మందికి పైగా కంటి చూపు తిరిగి వచ్చింది. కరోనా మహమ్మారిలో వేలాది మంది ప్రాణాలు రక్షించాం. మరెన్నో సేవలు అందించాం.
మన తోటి మానవులకు ఇలా సేవ చేయడంతో మనం పొందే సంతృప్తి అసమానమైనది. అమూల్యమైనది. CCT మానవతా కార్యక్రమాలను శక్తివంతం చేసి, మా సామూహిక మిషన్కు శక్తినిచ్చిన లక్షలాది మంది ఉదార సోదరులు, సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను! ఇది మన దేశానికి చేస్తున్న సహకారం! ఇదే మహాత్ముడికి మనం అర్పించే నివాళి’ అంటూ రాసుకొచ్చారు. ఇక మహాత్మగాంధీ జయంతి వేడుకులను దేశ శ్యాప్తంగా జరుపుతున్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









