చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు 25 ఏళ్లు.. ‘మహాత్మకు ఇదే మన నివాళి’ - మెగాస్టార్ చిరంజీవి
- October 02, 2023
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో హీరోగా అగ్రస్థాయికి చేరుకున్నారు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇక అదే స్థాయిలో సేవా కార్యక్రమాలనూ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలో 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. దీనితోపాటు చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్స్ ను స్థాపించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ బ్యాక్ చాలా పెద్దది. అయితే గాంధీ జయంతి రోజునే ఈ బ్లడ్ బ్యాంక్ ను స్థాపించడం విశేషం. నేటితో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తైంది.
ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఆసక్తికరమైన నోట్ విడుదల చేశారు. ట్వీట్ లో.. మన దేశానికి ఇది ముఖ్యమైన రోజు. నేను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సిసిటి) ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తైంది. అద్భుతమైన ప్రయాణం ట్రస్ట్ పై ప్రేమను ప్రతిబింబిస్తోంది. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి పేదలకు అందించాం. కంటి పంపిణీ ద్వారా 10 వేల మందికి పైగా కంటి చూపు తిరిగి వచ్చింది. కరోనా మహమ్మారిలో వేలాది మంది ప్రాణాలు రక్షించాం. మరెన్నో సేవలు అందించాం.
మన తోటి మానవులకు ఇలా సేవ చేయడంతో మనం పొందే సంతృప్తి అసమానమైనది. అమూల్యమైనది. CCT మానవతా కార్యక్రమాలను శక్తివంతం చేసి, మా సామూహిక మిషన్కు శక్తినిచ్చిన లక్షలాది మంది ఉదార సోదరులు, సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను! ఇది మన దేశానికి చేస్తున్న సహకారం! ఇదే మహాత్ముడికి మనం అర్పించే నివాళి’ అంటూ రాసుకొచ్చారు. ఇక మహాత్మగాంధీ జయంతి వేడుకులను దేశ శ్యాప్తంగా జరుపుతున్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







