జర్మనీలో సందర్శకులను ఆకర్షిస్తున్న ఒమానీ టెంటు
- June 26, 2015
జర్మనీలోని కియెల్ పట్టణంలో జరుగుతున్న కియెల్ సెయిలింగ్ వీక్ లో, ఒమాన్ సెయిల్ ప్రోజెక్టు వారిచే ఏర్పాటుచేయబడిన టెంటు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జూన్ 20 నుండి 28 వరకు జరుగనున్న ఈ సెయిలింగ్ వీక్ లో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన విలాయత్ ఆఫ్ నిజ్వా ఇంకా నీయాబత్ ఆఫ్ జబాల్ అల్ అక్ధర్ యొక్క నమూనాలు, రోజ్ వాటర్ , మృణ్మయ పాత్రలు మరియు వెండి ఆభరణాల తయారీ వంటివాటిని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇక్కడి అధికారులు నౌకా నిర్మాణానికి ప్రసిద్ధమైన విలాయత్ ఆఫ్ సూర్, ఇంకా మస్కట్ సిటీ, అల్ శర్కీయా డ్యూన్స్, మత్రాః సౌక్, అల్ దెమానియత్ దీవులు, మస్కట్లోని రాయల్ ఒపేరా హౌస్ వంటి వివిధ పర్యాటక మరియు సాంస్కృతిక సంబంధమైన ప్రదేశాలకు సంబంధించిన వివరాలను, ముద్రణలను సందర్శకులకు అందజేస్తున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









