జర్మనీలో సందర్శకులను ఆకర్షిస్తున్న ఒమానీ టెంటు
- June 26, 2015
జర్మనీలోని కియెల్ పట్టణంలో జరుగుతున్న కియెల్ సెయిలింగ్ వీక్ లో, ఒమాన్ సెయిల్ ప్రోజెక్టు వారిచే ఏర్పాటుచేయబడిన టెంటు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జూన్ 20 నుండి 28 వరకు జరుగనున్న ఈ సెయిలింగ్ వీక్ లో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన విలాయత్ ఆఫ్ నిజ్వా ఇంకా నీయాబత్ ఆఫ్ జబాల్ అల్ అక్ధర్ యొక్క నమూనాలు, రోజ్ వాటర్ , మృణ్మయ పాత్రలు మరియు వెండి ఆభరణాల తయారీ వంటివాటిని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇక్కడి అధికారులు నౌకా నిర్మాణానికి ప్రసిద్ధమైన విలాయత్ ఆఫ్ సూర్, ఇంకా మస్కట్ సిటీ, అల్ శర్కీయా డ్యూన్స్, మత్రాః సౌక్, అల్ దెమానియత్ దీవులు, మస్కట్లోని రాయల్ ఒపేరా హౌస్ వంటి వివిధ పర్యాటక మరియు సాంస్కృతిక సంబంధమైన ప్రదేశాలకు సంబంధించిన వివరాలను, ముద్రణలను సందర్శకులకు అందజేస్తున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









