జర్మనీలో సందర్శకులను ఆకర్షిస్తున్న ఒమానీ టెంటు
- June 26, 2015
జర్మనీలోని కియెల్ పట్టణంలో జరుగుతున్న కియెల్ సెయిలింగ్ వీక్ లో, ఒమాన్ సెయిల్ ప్రోజెక్టు వారిచే ఏర్పాటుచేయబడిన టెంటు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జూన్ 20 నుండి 28 వరకు జరుగనున్న ఈ సెయిలింగ్ వీక్ లో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన విలాయత్ ఆఫ్ నిజ్వా ఇంకా నీయాబత్ ఆఫ్ జబాల్ అల్ అక్ధర్ యొక్క నమూనాలు, రోజ్ వాటర్ , మృణ్మయ పాత్రలు మరియు వెండి ఆభరణాల తయారీ వంటివాటిని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇక్కడి అధికారులు నౌకా నిర్మాణానికి ప్రసిద్ధమైన విలాయత్ ఆఫ్ సూర్, ఇంకా మస్కట్ సిటీ, అల్ శర్కీయా డ్యూన్స్, మత్రాః సౌక్, అల్ దెమానియత్ దీవులు, మస్కట్లోని రాయల్ ఒపేరా హౌస్ వంటి వివిధ పర్యాటక మరియు సాంస్కృతిక సంబంధమైన ప్రదేశాలకు సంబంధించిన వివరాలను, ముద్రణలను సందర్శకులకు అందజేస్తున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







