వాయిదా పడిన 'జేమ్స్ బాండ్' చిత్రం
- June 26, 2015
అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం 'జేమ్స్ బాండ్'. 'నేను కాదు నా పెళ్లాం' ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కావాల్సివుంది. కానీ సాంకేతిక కారణాలవల్ల చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ... మా బ్యానర్లో వస్తున్న నాలుగో చిత్రం. మంచి ఎంటర్ టైనర్. ప్రస్తుతం సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతాన్నందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయికిషోర్ అనుకున్నవిధంగా తెరకెక్కించారు. అల్లరి నరేష్ స్టయిల్ ఆఫ్ కామెడి ఉంటుంది. ప్రేక్షకులు నరేష్ చిత్రం ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి కామెడి ఎంటర్ టైనర్ మూవీ ఇది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తున్నాం' అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









