వాహన బీమా ఉల్లంఘనపై ఇ-మానిటరింగ్ ప్రారంభం
- October 03, 2023
జెడ్డా: సౌదీ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అక్టోబర్ 1 నుంచి వాహన బీమా ఉల్లంఘనపై ఇ-మానిటరింగ్ చేయడం ప్రారంభించింది. అన్ని నగరాలు, గవర్నరేట్లలో వర్తింపజేయనున్నట్లు ట్రాఫిక్ విభాగం తెలిపింది. వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా లేనప్పుడు వాహనం యొక్క ఉల్లంఘన ప్రతి 15 రోజులకు ఒకసారి ఎలక్ట్రానిక్గా పర్యవేక్షించబడుతుందన్నారు. అబ్షర్ ప్లాట్ఫారమ్లో లబ్ధిదారుని ఖాతాలోకి లాగిన్ చేయడం, వాహన సేవలకు వెళ్లడం, విచారణలు, ఆపై వాహన బీమా చెల్లుబాటును ఎంచుకోవడం వంటి ఐదు దశల ద్వారా వాహన బీమా చెల్లుబాటు గురించి విచారించవచ్చని తెలిపింది. వాహన బీమా లేకపోతే కనీస జరిమానా SR100, గరిష్టంగా SR150 విధించనున్నట్లు హెచ్చరించారు. వాహన డ్రైవర్లు, పౌరులు, ప్రవాసులు ట్రాఫిక్ నిబంధనలు, సూచనలను పాటించాలని, అలాగే ఏదైనా ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించినప్పుడు చెల్లుబాటు అయ్యే బీమా ఎంతో ఉపయోగపడుతుందని డిపార్ట్మెంట్ సూచించింది.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









