వాహన బీమా ఉల్లంఘనపై ఇ-మానిటరింగ్ ప్రారంభం
- October 03, 2023
జెడ్డా: సౌదీ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అక్టోబర్ 1 నుంచి వాహన బీమా ఉల్లంఘనపై ఇ-మానిటరింగ్ చేయడం ప్రారంభించింది. అన్ని నగరాలు, గవర్నరేట్లలో వర్తింపజేయనున్నట్లు ట్రాఫిక్ విభాగం తెలిపింది. వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా లేనప్పుడు వాహనం యొక్క ఉల్లంఘన ప్రతి 15 రోజులకు ఒకసారి ఎలక్ట్రానిక్గా పర్యవేక్షించబడుతుందన్నారు. అబ్షర్ ప్లాట్ఫారమ్లో లబ్ధిదారుని ఖాతాలోకి లాగిన్ చేయడం, వాహన సేవలకు వెళ్లడం, విచారణలు, ఆపై వాహన బీమా చెల్లుబాటును ఎంచుకోవడం వంటి ఐదు దశల ద్వారా వాహన బీమా చెల్లుబాటు గురించి విచారించవచ్చని తెలిపింది. వాహన బీమా లేకపోతే కనీస జరిమానా SR100, గరిష్టంగా SR150 విధించనున్నట్లు హెచ్చరించారు. వాహన డ్రైవర్లు, పౌరులు, ప్రవాసులు ట్రాఫిక్ నిబంధనలు, సూచనలను పాటించాలని, అలాగే ఏదైనా ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించినప్పుడు చెల్లుబాటు అయ్యే బీమా ఎంతో ఉపయోగపడుతుందని డిపార్ట్మెంట్ సూచించింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







