‘టైగర్’ ప్యాన్ ఇండియా వర్కవుట్ అవుతుందా.?
- October 04, 2023
మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా త్వరలో రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ సినిమాని ప్యాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కోణంలోనే బాలీవుడ్లో సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు.
అయితే, ఇటీవల తెలుగు సినిమాలు బాలీవుడ్లో పెద్దగా వర్కవుట్ కావడం లేదు. చాలా సినిమాలు అక్కడ బొక్క బోర్లా పడ్డాయి. ఇక మాస్ రాజా విషయానికి వస్తే, తెలుగులోనే దారుణంగా ఫ్లాప్ అవుతున్నాడు. ఇక, హిందీలో అది కూడా ప్యాన్ ఇండియా.. అంటే అస్సలు వర్కవుట్ అయ్యే పనేనా.?
కానీ, సినిమాకి బిజినెస్ బాగా జరిగిందంటున్నారు. బాలీవుడ్లో సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. స్టూవర్ట్పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సబ్జెక్ట్ ఒకింత కలిసొచ్చే అవకాశముంది.
అయినా, కానీ, రవితేజ వైపు నుంచి చూస్తే.. ఎంత మేర కలిసొస్తుందో తెలియక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. కానీ, రవితేజ మాత్రం పక్కా నమ్మకంగా వున్నాడట. ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొడతానంటున్నాడట. చూడాలి మరి. అన్నట్లు కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ఈ సినిమాలో రవితేజకి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









