‘టైగర్’ ప్యాన్ ఇండియా వర్కవుట్ అవుతుందా.?
- October 04, 2023
మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా త్వరలో రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ సినిమాని ప్యాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కోణంలోనే బాలీవుడ్లో సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు.
అయితే, ఇటీవల తెలుగు సినిమాలు బాలీవుడ్లో పెద్దగా వర్కవుట్ కావడం లేదు. చాలా సినిమాలు అక్కడ బొక్క బోర్లా పడ్డాయి. ఇక మాస్ రాజా విషయానికి వస్తే, తెలుగులోనే దారుణంగా ఫ్లాప్ అవుతున్నాడు. ఇక, హిందీలో అది కూడా ప్యాన్ ఇండియా.. అంటే అస్సలు వర్కవుట్ అయ్యే పనేనా.?
కానీ, సినిమాకి బిజినెస్ బాగా జరిగిందంటున్నారు. బాలీవుడ్లో సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. స్టూవర్ట్పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సబ్జెక్ట్ ఒకింత కలిసొచ్చే అవకాశముంది.
అయినా, కానీ, రవితేజ వైపు నుంచి చూస్తే.. ఎంత మేర కలిసొస్తుందో తెలియక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. కానీ, రవితేజ మాత్రం పక్కా నమ్మకంగా వున్నాడట. ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొడతానంటున్నాడట. చూడాలి మరి. అన్నట్లు కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ఈ సినిమాలో రవితేజకి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







