‘టైగర్’ ప్యాన్ ఇండియా వర్కవుట్ అవుతుందా.?
- October 04, 2023
మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా త్వరలో రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ సినిమాని ప్యాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కోణంలోనే బాలీవుడ్లో సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు.
అయితే, ఇటీవల తెలుగు సినిమాలు బాలీవుడ్లో పెద్దగా వర్కవుట్ కావడం లేదు. చాలా సినిమాలు అక్కడ బొక్క బోర్లా పడ్డాయి. ఇక మాస్ రాజా విషయానికి వస్తే, తెలుగులోనే దారుణంగా ఫ్లాప్ అవుతున్నాడు. ఇక, హిందీలో అది కూడా ప్యాన్ ఇండియా.. అంటే అస్సలు వర్కవుట్ అయ్యే పనేనా.?
కానీ, సినిమాకి బిజినెస్ బాగా జరిగిందంటున్నారు. బాలీవుడ్లో సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. స్టూవర్ట్పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సబ్జెక్ట్ ఒకింత కలిసొచ్చే అవకాశముంది.
అయినా, కానీ, రవితేజ వైపు నుంచి చూస్తే.. ఎంత మేర కలిసొస్తుందో తెలియక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. కానీ, రవితేజ మాత్రం పక్కా నమ్మకంగా వున్నాడట. ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొడతానంటున్నాడట. చూడాలి మరి. అన్నట్లు కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ఈ సినిమాలో రవితేజకి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







