ఆసియా క్రీడలు: రెండో గోల్డ్ మెడల్ సాధించిన సౌదీ అథ్లెట్
- October 04, 2023
హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో సౌదీ రన్నర్ ఎస్సా క్జ్వానీ 800 మీటర్ల రేసులో 1:48.05 నిమిషాలతో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 21 ఏళ్ల అథ్లెట్ ఎస్సా క్జ్వానీ సౌదీ అరేబియాకు రెండవ బంగారు పతకాన్ని.. ఆసియా క్రీడలలో ఐదవ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సాధించిన 1:47:18 నిమిషాల వ్యక్తిగత అత్యుత్తమ స్థాయిని అధిగమించాడు. ఎస్సాక్జ్వానీ తన కెరీర్లో ఆసియా క్రీడల్లో మొట్టమొదటి బంగారు పతకాన్ని సాధించాడు. ఆసియా క్రీడల సందర్భంగా, యూసెఫ్ మస్రాహి 400 మీటర్ల పరుగులో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్లో సౌదీ అరేబియాకు మొదటి పతకాన్ని అందించాడు. పోల్ వాల్ట్లో హుస్సేన్ అల్-హిజామ్ రజత పతకాన్ని, 200 మీటర్ల పరుగులో అబ్దుల్లా అబ్కర్ రజతం సాధించగా, షాట్పుట్లో మహ్మద్ తోలు రజతం సాధించారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









