కువైట్ లో 34 మంది భారతీయ నర్సులు విడుదల
- October 05, 2023
కువైట్: కువైట్ నగరంలోని ఒక ప్రసిద్ధ క్లినిక్లో నిర్వహించిన భద్రతా పరమైన దాడిలో భాగంగా గత 23 రోజులుగా నిర్బంధంలో ఉన్న సుమారు 60 మంది కార్మికులను కువైట్ బుధవారం విడుదల చేసింది. ఇందులో 34 మంది భారతీయ నర్సులు ఉన్నారు. వారిలో చాలా మంది గత 3 నుండి 4 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు. భారత ఉన్నతాధికారుల జోక్యంతో విడుదల కార్యక్రమం సాఫీగా జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అరెస్టయిన వారి బంధువులు ఉన్నతాధికారులను కలిసి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్.. కువైట్లోని భారత రాయబార కార్యాలయం సాయంతో భారతీయుల విడుదల కోసం తీవ్రంగా కృషి చేశారు.
తాజా వార్తలు
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు
- తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..
- ఆరు నెలలకే తొలగింపు.. కోల్కతాలో మెస్సీ విగ్రహం తొలగింపు
- దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయడుకు ఘనస్వాగతం
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!









