కువైట్ లో 34 మంది భారతీయ నర్సులు విడుదల
- October 05, 2023
కువైట్: కువైట్ నగరంలోని ఒక ప్రసిద్ధ క్లినిక్లో నిర్వహించిన భద్రతా పరమైన దాడిలో భాగంగా గత 23 రోజులుగా నిర్బంధంలో ఉన్న సుమారు 60 మంది కార్మికులను కువైట్ బుధవారం విడుదల చేసింది. ఇందులో 34 మంది భారతీయ నర్సులు ఉన్నారు. వారిలో చాలా మంది గత 3 నుండి 4 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు. భారత ఉన్నతాధికారుల జోక్యంతో విడుదల కార్యక్రమం సాఫీగా జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అరెస్టయిన వారి బంధువులు ఉన్నతాధికారులను కలిసి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్.. కువైట్లోని భారత రాయబార కార్యాలయం సాయంతో భారతీయుల విడుదల కోసం తీవ్రంగా కృషి చేశారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







