ముంబైలో అగ్నిప్రమాదం..ఏడుగురి మృతి

- October 06, 2023 , by Maagulf
ముంబైలో అగ్నిప్రమాదం..ఏడుగురి మృతి

ముంబై: ముంబైలో ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు. మహారాష్ట్రలోని ముంబై పరిధిలోని గోరేగావ్‌లోని ఓ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరో 40 మంది తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా దగ్ధమయ్యాయి.

అగ్నిమాపక సిబ్బంది భవనంలో మంటలను ఆర్పుతున్నారు. ఏడు అంతస్తుల భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వెంటనే మంటలను ఆర్పే చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పార్కింగ్ ఏరియాలో పడి ఉన్న గుడ్డకు మంటలు అంటుకోవడంతో మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com