ఐదు రాష్ట్రాలకు మరో రెండుమూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్
- October 06, 2023
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించిన వార్తలు జాతీయ మీడియాలో తెరపైకి వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణ సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఆ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 8 లేదా 10 తేదీల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఇక నవంబర్ రెండో వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 10 నుంచి 15 మధ్య ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే, దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
తాజా వార్తలు
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!
- ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 22 మంది అరెస్టు..!!
- ఖతార్లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!
- ప్రాంతీయ భద్రతపై క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు చర్చలు..!!









