కేంద్ర మంత్రి అమిత్ షా తో ఏపీ సీఎం జగన్ భేటీ..

- October 07, 2023 , by Maagulf
కేంద్ర మంత్రి అమిత్ షా తో ఏపీ సీఎం జగన్ భేటీ..

న్యూ ఢిల్లీ: ఏపీ సీఎం జగన్..ఢిల్లీ లో కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలతో పాటు వివిధ అంశాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది.

అంతకుముందు, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి కూడా సీఎం జగన్ హాజరయ్యారు. జగన్ నిన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని రేపు ఏపీకి తిరిగి రానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com