ఎయిర్ ఇండియా కొత్త విధానం..మహిళా ప్రయాణీకులకు ప్రత్యేక సీటింగ్ ఆప్షన్లు
- October 07, 2023
యూఏఈ: ఎయిర్ ఇండియా కొత్త విధానం త్వరలో అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. మహిళా ప్రయాణీకులకు ప్రత్యేక సీటింగ్ ఆప్షన్లు కల్పించనున్నారు. దీంతో మహిళలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. ఎయిర్ ఇండియా మహిళా ఫ్లైయర్లు ప్రత్యేక సీట్లను ఎంచుకునేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఒంటరి మహిళా ప్రయాణికులు, తల్లులకు ప్రత్యేకంగా వారికి నచ్చిన విధంగా సీటింగ్ ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇవ్వనున్నారు. అదే సమయంలో ఖాళీగా సీట్లు ఉన్నట్లయితే, పురుషుల మధ్య కూర్చున్న ఒంటరి మహిళా ప్రయాణికులకు వేరే సీటును కేటాయించవచ్చు. క్యాబిన్ క్రూ సభ్యులు బేసినెట్ లొకేషన్ ఉన్న సీటును శిశువులతో ఉన్న తల్లులకు కేటాయించవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







