ఎయిర్ ఇండియా కొత్త విధానం..మహిళా ప్రయాణీకులకు ప్రత్యేక సీటింగ్ ఆప్షన్లు

- October 07, 2023 , by Maagulf
ఎయిర్ ఇండియా కొత్త విధానం..మహిళా ప్రయాణీకులకు ప్రత్యేక సీటింగ్ ఆప్షన్లు

యూఏఈ: ఎయిర్ ఇండియా కొత్త విధానం త్వరలో అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. మహిళా ప్రయాణీకులకు ప్రత్యేక సీటింగ్ ఆప్షన్లు కల్పించనున్నారు. దీంతో మహిళలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. ఎయిర్ ఇండియా మహిళా ఫ్లైయర్‌లు ప్రత్యేక సీట్లను ఎంచుకునేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఒంటరి మహిళా ప్రయాణికులు, తల్లులకు ప్రత్యేకంగా వారికి నచ్చిన విధంగా సీటింగ్ ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇవ్వనున్నారు. అదే సమయంలో ఖాళీగా సీట్లు ఉన్నట్లయితే, పురుషుల మధ్య కూర్చున్న ఒంటరి మహిళా ప్రయాణికులకు వేరే సీటును కేటాయించవచ్చు. క్యాబిన్ క్రూ సభ్యులు బేసినెట్ లొకేషన్ ఉన్న సీటును శిశువులతో ఉన్న తల్లులకు కేటాయించవచ్చు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com