ఎయిర్ ఇండియా కొత్త విధానం..మహిళా ప్రయాణీకులకు ప్రత్యేక సీటింగ్ ఆప్షన్లు
- October 07, 2023
యూఏఈ: ఎయిర్ ఇండియా కొత్త విధానం త్వరలో అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. మహిళా ప్రయాణీకులకు ప్రత్యేక సీటింగ్ ఆప్షన్లు కల్పించనున్నారు. దీంతో మహిళలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. ఎయిర్ ఇండియా మహిళా ఫ్లైయర్లు ప్రత్యేక సీట్లను ఎంచుకునేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఒంటరి మహిళా ప్రయాణికులు, తల్లులకు ప్రత్యేకంగా వారికి నచ్చిన విధంగా సీటింగ్ ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇవ్వనున్నారు. అదే సమయంలో ఖాళీగా సీట్లు ఉన్నట్లయితే, పురుషుల మధ్య కూర్చున్న ఒంటరి మహిళా ప్రయాణికులకు వేరే సీటును కేటాయించవచ్చు. క్యాబిన్ క్రూ సభ్యులు బేసినెట్ లొకేషన్ ఉన్న సీటును శిశువులతో ఉన్న తల్లులకు కేటాయించవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









