ఉగ్రవాద దాడిని ఖండించిన సౌదీ అరేబియా

- October 07, 2023 , by Maagulf
ఉగ్రవాద దాడిని ఖండించిన సౌదీ అరేబియా

రియాద్: నైజర్‌లోని టబాటోల్ వాయువ్య ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. అక్టోబరు 2న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఘోరమైన దాడిలో 29 మంది సైనికులు మరణించగా, అనేకమందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సౌదీ అరేబియా బాధిత కుటుంబాలకు,  నైజర్ ప్రభుత్వానికి సానుభూతిని తెలిపింది. అన్ని రకాల ఉగ్రవాదం, హింస,  తీవ్రవాదాన్ని పూర్తిగా తిరస్కరించినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com