టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
- October 09, 2023
తిరుమల: టీడీపీ పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. భక్తులు తమ పేరుపై చేసుకునే విధంగా నిరంతరాయ యాగం చేయాలని..టీటీడీలో శానిటరీ కార్మికుల జీతం రూ. 12,000 నుండి రూ.17 వేలకు పైగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 5 వేల మంది కార్మికులకు ఉపయోగకంగా ఉండనుంది.
శ్రీ లక్ష్మి మాన్ పవర్ కార్పొరేషన్ కు ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 3 శాతం పెంచాలే నిర్ణయించింది. వివిధ కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా 2 సంవత్సరాలకు 3 శాతం జీతం పెంపుకు నిర్ణయించింది. రూ.18 కోట్లతో వ్యయంతో నారాయణ గిరి వద్ద భక్తుల కోసం ఆధునాతన కాంప్లెక్స్ భక్తులకోసం నిర్మాణం చేపట్టాలనే కీలక నిర్ణయం తీసుకుంది.పాపవినాశనం వరకు రూ.40 కోట్లతో 4 లైన్ రోడ్డు, వరాహ అతిథి గృహం వద్ద రూ.10.50 కోట్లతో నుండి రోడ్డు విస్తరణ పనులు,తిరుపతి పట్టణ పారిశుధ్యం మెరుగు పరిచాలని బోర్డు నిర్ణయించింది.
తిరుపతి పట్టణ పారిశుధ్యం మెరుగు పరుచు టలో భాగంగా టీటీడీ బాగ స్వామ్యం చేయాలని నిర్ణయించింది.టీటీడీ మొత్తం బడ్జెట్ లో 1 శాతం తిరుపతి అభివృద్ధికి ఇవ్వాలని..చేర్లో పల్లి మంగాపురం రోడ్డు విస్తరణ కోసం రూ.25 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.టీటీడీ కల్యాణ మండపాల్లో జరిగే కార్య క్రమాలు భక్తి పాటలే ఉండాలని నిర్ణయంతో పాటు టిటిడి ఆస్థాన విద్వాంసుడు గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాని కోరాలని పాలకమండలి తీర్మానం చేసింది.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







