కువైట్కు 25శాతం పెరిగిన భారతదేశ ఎగుమతులు
- October 10, 2023
కువైట్: 2022-23 ఆర్థిక సంవత్సరంలో కువైట్కు భారతదేశ ఎగుమతులు 25.6% పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) తెలిపింది. కువైట్కు భారతీయ ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.24 బిలియన్ డాలర్ల నుండి 1.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ వృద్ధి భారతదేశం-కువైట్ మధ్య బలమైన, అభివృద్ధి చెందుతున్న వాణిజ్య భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు FIEO దాని అధికారిక X (గతంలో Twitter అని పిలుస్తారు) హ్యాండ్లర్లో ట్వీట్ చేసింది.గత నెల ప్రారంభంలో కువైట్లోని భారత రాయబారి మాట్లాడుతూ.. భారతదేశం - కువైట్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 12.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు. కువైట్కు బియ్యం, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, ఇంజినీరింగ్ వస్తువులతో సహా అనేక రకాల వస్తువులను భారతదేశం ఎగుమతి చేస్తుంది. అదే సమయంలో కువైట్ నుంచి భారతదేశం భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







