కువైట్‌కు 25శాతం పెరిగిన భారతదేశ ఎగుమతులు

- October 10, 2023 , by Maagulf
కువైట్‌కు 25శాతం పెరిగిన భారతదేశ ఎగుమతులు

కువైట్: 2022-23 ఆర్థిక సంవత్సరంలో కువైట్‌కు భారతదేశ ఎగుమతులు 25.6% పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) తెలిపింది. కువైట్‌కు భారతీయ ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.24 బిలియన్ డాలర్ల నుండి 1.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ వృద్ధి భారతదేశం-కువైట్ మధ్య బలమైన, అభివృద్ధి చెందుతున్న వాణిజ్య భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు  FIEO దాని అధికారిక X (గతంలో Twitter అని పిలుస్తారు) హ్యాండ్లర్‌లో ట్వీట్ చేసింది.గత నెల ప్రారంభంలో కువైట్‌లోని భారత రాయబారి మాట్లాడుతూ.. భారతదేశం - కువైట్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 12.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు. కువైట్‌కు బియ్యం, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, ఇంజినీరింగ్ వస్తువులతో సహా అనేక రకాల వస్తువులను భారతదేశం ఎగుమతి చేస్తుంది.  అదే సమయంలో కువైట్ నుంచి  భారతదేశం భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com