బహ్రెయిన్లోకి డ్రగ్స్ తరలింపు.. వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష
- October 10, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లోకి 500 ట్రామాడాల్ క్యాప్సూల్స్ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినందుకు నలభై ఏళ్ల వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. బహ్రెయిన్ కస్టమ్ అధికారుల కథనం ప్రకారం..అనుమానితుడు తన ఆసియా దేశం నుండి బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతని దుస్తులలో డ్రగ్ క్యాప్సూల్స్ ను దాచాడు. యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. విచారణలో, నిందితుడు బహ్రెయిన్కు అక్రమంగా రవాణా చేయాలనే ఉద్దేశ్యంతో అక్రమ డ్రగ్స్ తీసుకొచ్చినట్టు అంగీకరించాడు. అతని లోదుస్తులలో 500 కంటే ఎక్కువ ట్రామడాల్ క్యాప్సూల్స్ ను గుర్తించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై అక్రమ రవాణా ఉద్దేశంతో ట్రామాడోల్, మెథాంఫెటమైన్, గంజాయి మరియు డయాజెపామ్లను దిగుమతి చేసుకున్నట్లు మరియు కలిగి ఉన్నట్లు అభియోగాలు మోపింది. అలాగే చట్టపరమైన అనుమతి లేకుండా వ్యక్తిగత ఉపయోగం కోసం గంజాయి, డయాజెపామ్లను కలిగి ఉన్నాడని నిరూపించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







