గాజా ముట్టడిని ఎత్తివేయాలని సౌదీ పిలుపు
- October 14, 2023
రియాద్: గాజా నుండి పాలస్తీనా ప్రజలను బలవంతంగా తరలించడాన్ని మానుకోవాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్నదాడులు పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించింది. పౌరులకు వ్యతిరేకంగా అన్ని రకాల సైనిక విపత్తులను అరికట్టాలని, గాజా నివాసితులకు అవసరమైన వైద్య సామాగ్రిని అందించడంలో త్వరితగతిన జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. గాజాపై దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు మరియు మానవతా సూత్రాలకు కట్టుబడి ఉండేలా ఇజ్రాయెల్ కు సూచించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అరబ్ పీస్ ఇనిషియేటివ్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దుల ఆధారంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపన జరిగిందని, పాలస్తీనా సమస్యకు న్యాయమైన మరియు శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావడానికి అంతర్జాతీయ తీర్మానాలు, చొరవలకు అనుగుణంగా శాంతి ప్రక్రియకు కట్టుబడి ఉండాలని సౌదీ కోరింది.
తాజా వార్తలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!







