ఇవాళ్టి నుంచి తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు
- October 15, 2023
తిరుమల: తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలకు నిన్న (శనివారం) సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు.
అంకూరార్పణ సందర్భంగా సేనాధిపతి విష్వక్సేనులవారు ఆలయ మాడ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మహ్సవాల ఏర్పాట్లను పరీశీలించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారిని దర్శించడానికి రోజూ లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.
అయితే, శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీవారి దర్శనాన్ని కల్పించడంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందుకే సర్వదర్శన టోకెన్ల సంఖ్యను కూడా పెంచారు. కాలినడకన వచ్చే వారు నేరుగా శ్రీవారి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. లడ్డూ ప్రసాదాలను సైతం సిద్ధం చేశారు. ప్రతిరోజూ లక్షకు పైగా లడ్లను టీటీడీ విక్రయించనుంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు తెల్లవారు జామున 5 నుంచి 5:45 నిమిషాల వరకు వేద విద్యార్థులు చతుర్వేదాలతో వేదఘోష జరుపనున్నారు. 5:45 నుంచి 6:45 గంటల వరకు భారత్ లోని ప్రముఖ పండితులతో వేద విజ్ఞానంపై సదస్సు నిర్వహిస్తారు.. ఈ సారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకతగా వేదఘోష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









