అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ను ఛేదించిన పోలీసులు..
- October 16, 2023
యూఏఈ: షార్జా పోలీసుల మాదకద్రవ్యాల నిరోధక దళాలు 32 మంది ఆసియా, అరబ్ జాతీయులతో కూడిన అంతర్జాతీయ క్రిమినల్ ముఠాను 'అన్వైలింగ్ ది కర్టెన్' పేరుతో నిర్వహించిన ఆపరేషన్లో పట్టుకున్నాయి. ఈ ముఠా నుంచి భారీగా మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. దాదాపు ఒక మిలియన్ సైకోట్రోపిక్ పదార్థాలను దేశంలోకి అక్రమంగా తరలించే ప్రయత్నాలను అడ్డుకున్నట్లు.. వీటి మార్కెట్ విలువ 14 మిలియన్ దిర్హాములు ఉంటుందని షార్జా పోలీస్లోని యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ మాజిద్ అల్ అస్సాం తెలిపారు. ఖచ్చితమైన ఆధారాల సేకరణ తర్వాత రౌండ్-ది-క్లాక్ పర్యవేక్షణ ద్వారా 50 కిలోల గంజాయి, 49 లీటర్ల లిక్విడ్ క్రిస్టల్తో ఒక బృందాన్ని అరెస్టు చేసింది. షార్జా పోలీసులు మిగిలిన ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఒక మిలియన్ మరియు 170 వేల సైకోట్రోపిక్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద కేసులను 8004654కు కాల్ చేయడం ద్వారా లేదా [email protected] aeకి ఇమెయిల్ చేయడం ద్వారా మాదక ద్రవ్యాల గురించిన సమాచారాన్ని తెలపాలని షార్జా పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









