అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ను ఛేదించిన పోలీసులు..
- October 16, 2023
యూఏఈ: షార్జా పోలీసుల మాదకద్రవ్యాల నిరోధక దళాలు 32 మంది ఆసియా, అరబ్ జాతీయులతో కూడిన అంతర్జాతీయ క్రిమినల్ ముఠాను 'అన్వైలింగ్ ది కర్టెన్' పేరుతో నిర్వహించిన ఆపరేషన్లో పట్టుకున్నాయి. ఈ ముఠా నుంచి భారీగా మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. దాదాపు ఒక మిలియన్ సైకోట్రోపిక్ పదార్థాలను దేశంలోకి అక్రమంగా తరలించే ప్రయత్నాలను అడ్డుకున్నట్లు.. వీటి మార్కెట్ విలువ 14 మిలియన్ దిర్హాములు ఉంటుందని షార్జా పోలీస్లోని యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ మాజిద్ అల్ అస్సాం తెలిపారు. ఖచ్చితమైన ఆధారాల సేకరణ తర్వాత రౌండ్-ది-క్లాక్ పర్యవేక్షణ ద్వారా 50 కిలోల గంజాయి, 49 లీటర్ల లిక్విడ్ క్రిస్టల్తో ఒక బృందాన్ని అరెస్టు చేసింది. షార్జా పోలీసులు మిగిలిన ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఒక మిలియన్ మరియు 170 వేల సైకోట్రోపిక్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద కేసులను 8004654కు కాల్ చేయడం ద్వారా లేదా [email protected] aeకి ఇమెయిల్ చేయడం ద్వారా మాదక ద్రవ్యాల గురించిన సమాచారాన్ని తెలపాలని షార్జా పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







