ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండ్లను వదిలిపోతున్న పాలస్తీయన్లు

- October 16, 2023 , by Maagulf
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండ్లను వదిలిపోతున్న పాలస్తీయన్లు

యూఏఈ: ఇజ్రాయెల్ దాడులకు వీలుగా దళాలను మోహరించడంతో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు గాజాలోని తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేసింది. ఇందులో దాదాపు 1,400 మంది వరకు చనిపోయారు. ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది. వైమానికి దాడులు చేపట్టింది. ఇందులో కూడా 2000 మంది వరకు మరణించారు. ఈ నేపథ్యంలో ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో యూఎన్ నిర్వహించే పాఠశాలలతో సహా తమకు వీలైన చోట ఆశ్రయం పొందేందుకు ఎన్‌క్లేవ్‌కు ఉత్తరాన ఉన్న తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు పాలస్తీనియన్లు. ఈ పరిణామాల మధ్య ఈ ప్రాంతం మొత్తం అగాధం అంచున ఉందని UN చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com