దుబాయ్-ఇండియా విమానం కరాచీకి మళ్లింపు

- October 16, 2023 , by Maagulf
దుబాయ్-ఇండియా విమానం కరాచీకి మళ్లింపు

యూఏఈ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ నుండి అమృత్‌సర్‌కు వెళుతుండగా అకస్మాత్తుగా ఏర్పడిన వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా.. ఒక ప్రయాణికుడికి తక్షణ వైద్య సహాయం అందించడానికి పాకిస్తాన్‌లోని కరాచీకి మళ్లించినట్లు ఎయిరిండియా తెలిపింది. అక్టోబరు 14 నాడు దుబాయ్ నుండి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:51 గంటలకు అమృత్‌సర్‌కు వెళ్లే మార్గంలో విమానం టేకాఫ్ అయినప్పుడు ఈ సంఘటన జరిగింది. విమానం మధ్యలో ఒక ప్రయాణీకుడు తీవ్రమైన వైద్య సమస్యను ఎదుర్కొన్నాడు, ప్రయాణీకుల ఆరోగ్యాన్ని కాపాడటానికి విమానాన్ని కరాచీకి మళ్లించినట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.  విమానం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిందని, విమానయాన సంస్థ, విమానాశ్రయ సిబ్బంది మరియు స్థానిక అధికారుల సమన్వయంతో ప్రయాణీకుడికి వైద్య సంరక్షణను అందించారు. వైద్య పరీక్షల తర్వాత ప్రయాణీకుడు ప్రయాణాన్ని కొనసాగించినట్లు ప్రకటించారు. స్థానిక సమయం మధ్యాహ్నం 2:30 గంటలకు కరాచీ నుండి అసలు గమ్యస్థానమైన అమృత్‌సర్‌కు బయలుదేరిందని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com