దుబాయ్-ఇండియా విమానం కరాచీకి మళ్లింపు
- October 16, 2023
యూఏఈ: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం దుబాయ్ నుండి అమృత్సర్కు వెళుతుండగా అకస్మాత్తుగా ఏర్పడిన వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా.. ఒక ప్రయాణికుడికి తక్షణ వైద్య సహాయం అందించడానికి పాకిస్తాన్లోని కరాచీకి మళ్లించినట్లు ఎయిరిండియా తెలిపింది. అక్టోబరు 14 నాడు దుబాయ్ నుండి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:51 గంటలకు అమృత్సర్కు వెళ్లే మార్గంలో విమానం టేకాఫ్ అయినప్పుడు ఈ సంఘటన జరిగింది. విమానం మధ్యలో ఒక ప్రయాణీకుడు తీవ్రమైన వైద్య సమస్యను ఎదుర్కొన్నాడు, ప్రయాణీకుల ఆరోగ్యాన్ని కాపాడటానికి విమానాన్ని కరాచీకి మళ్లించినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి తెలిపారు. విమానం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిందని, విమానయాన సంస్థ, విమానాశ్రయ సిబ్బంది మరియు స్థానిక అధికారుల సమన్వయంతో ప్రయాణీకుడికి వైద్య సంరక్షణను అందించారు. వైద్య పరీక్షల తర్వాత ప్రయాణీకుడు ప్రయాణాన్ని కొనసాగించినట్లు ప్రకటించారు. స్థానిక సమయం మధ్యాహ్నం 2:30 గంటలకు కరాచీ నుండి అసలు గమ్యస్థానమైన అమృత్సర్కు బయలుదేరిందని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







