దుబాయ్-ఇండియా విమానం కరాచీకి మళ్లింపు
- October 16, 2023
యూఏఈ: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం దుబాయ్ నుండి అమృత్సర్కు వెళుతుండగా అకస్మాత్తుగా ఏర్పడిన వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా.. ఒక ప్రయాణికుడికి తక్షణ వైద్య సహాయం అందించడానికి పాకిస్తాన్లోని కరాచీకి మళ్లించినట్లు ఎయిరిండియా తెలిపింది. అక్టోబరు 14 నాడు దుబాయ్ నుండి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:51 గంటలకు అమృత్సర్కు వెళ్లే మార్గంలో విమానం టేకాఫ్ అయినప్పుడు ఈ సంఘటన జరిగింది. విమానం మధ్యలో ఒక ప్రయాణీకుడు తీవ్రమైన వైద్య సమస్యను ఎదుర్కొన్నాడు, ప్రయాణీకుల ఆరోగ్యాన్ని కాపాడటానికి విమానాన్ని కరాచీకి మళ్లించినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి తెలిపారు. విమానం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిందని, విమానయాన సంస్థ, విమానాశ్రయ సిబ్బంది మరియు స్థానిక అధికారుల సమన్వయంతో ప్రయాణీకుడికి వైద్య సంరక్షణను అందించారు. వైద్య పరీక్షల తర్వాత ప్రయాణీకుడు ప్రయాణాన్ని కొనసాగించినట్లు ప్రకటించారు. స్థానిక సమయం మధ్యాహ్నం 2:30 గంటలకు కరాచీ నుండి అసలు గమ్యస్థానమైన అమృత్సర్కు బయలుదేరిందని ప్రకటించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









