రెండు ఏళ్ల బాలుడు నర్సరీ కొలనులో మునక
- May 22, 2016
రెండు సంవత్సరాల బాలుడు దుబాయ్ లో ఒక నర్సరీ కొలను వద్ద మునిగిపోతున్న సంఘటన తరువాత లతిఫా ఆసుపత్రిలో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. సయ్యద్ రజా అబ్బాస్ తన మూడవ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి కేవలం నాలుగు నెలల సమయం మాత్రామే ఉంది. గురువారం ఉదయం ఈ బాలుడు ప్రమాదానికి గురయ్యాడు నర్సరీ సిబ్బంది ఆడుకొనే సమయంలో బాలుడు లేదని గమనించారు. ఆ తరువాత సయ్యద్ నీటి కొలనులో నిర్జీవంగా కనపడ్డాడు. పసిపిల్లలకు యొక్క తండ్రి, సఫ్దర్ అబ్బాస్, ఆదివారం లతిఫా ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వద్ద ఖలీజ్ టైమ్స్ తో మాట్లాడుతూ తనకు ఉదయం 10 గంటల సమయంలో నర్సరీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తన కుమారుడు పాఠశాల యొక్క కొలనులొ పడిపోయినట్లు సమాచారం అందుకున్నట్లు తెలిపాడు." సంఘటన గూర్చి చాలా తక్కువ వివరాలు ఇచ్చారు, మాకు వెంటనే అనుమానం రేకెత్తించింది ఇది " అబ్బాస్ చెప్పారు.నర్సరీ ఇచ్చిన "పరిమిత వివరాలు" ప్రకారం ఉదయం ఆడుకొనే సమయంలో నీటి కొలనులో ఈ ప్రమాదం జరిగినట్లు సయ్యద్ కుటుంబానికి తెలియచేసారు. "అక్కడ పిల్లలను ఆడుకొనేందుకు వదిలిన తర్వాత వారి బాగోగుల చూసేందుకు ఇద్దరు పర్యవేక్షకులు ఒక గురువు నేతృత్వంలో 17 విద్యార్ధులని సంరక్షించుతుంటారు. మరియు. ఆట ప్రాంతంకు మరియు నీటి కొలను మధ్యదూరం గురించి 50 నుంచి -70 మీటర్ల దూరం ఉంటుంది , లేకపోతే మరింత దూరం ఉండవచ్చునాకు అర్థం లేదు తన స్వంతగా అంత దూరం ఎలా వెళ్లి వుంటాడని, "తన మామ ఖలీజ్ టైమ్స్ 'విలేఖరి చెప్పారు.
.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







