పాలస్తీనియన్లను రక్షించాలని బహ్రెయిన్ రాజు పిలుపు
- October 18, 2023
బహ్రెయిన్: హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పాలస్తీనా పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి, నిర్బంధించబడిన పౌరుల విడుదల కోసం కృషి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. గాజాకు వైద్య సహాయం, ఆహారం, నీరు మరియు విద్యుత్తు సదుపాయం కోసం అత్యవసర మానవతా కారిడార్లను తెరవాల్సిన అవసరం ఉందని HM రాజు చెప్పారు. న్యాయమైన శాంతి, స్థిరత్వాన్ని సాధించే దిశగా అన్ని ప్రయత్నాల సమన్వయానికి బహ్రెయిన్ రాజ్యం మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. భద్రత, సుస్థిరతను బలోపేతం చేయడానికి మరియు ఈ ప్రాంతంలో శాంతిని పటిష్టం చేయడానికి బహ్రెయిన్ ఆసక్తిని.. పాలస్తీనా సమస్యకు న్యాయమైన పరిష్కారాన్ని కనుగొనడంలో వైఖరిని, పాలస్తీనా ప్రజలకు వారి చట్టబద్ధమైన హక్కులను అందించేందుకు బహ్రెయిన్ కట్టుబడి ఉందన్నారు. ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్లోని ఇటాలియన్ ప్రధాన మంత్రి కార్యాలయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో నిన్న సమావేశమైన సందర్భంగా ఆయన ఈ ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో, వారు రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలతో పాటు వారి ఉమ్మడి ప్రయోజనాలను సాధించే సహకారం, ఉమ్మడి చర్యల యొక్క వివిధ అంశాలను సమీక్షించారు.వారు తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలు మరియు ప్రత్యేకించి గాజా స్ట్రిప్లోని పరిణామాల గురించి కూడా చర్చించారు. అంతర్జాతీయ శాంతి భద్రతల సేవలో అంతర్జాతీయ స్థాయిలో ఇటాలియన్ రిపబ్లిక్ పోషించిన ముఖ్యమైన పాత్రను హెచ్ఎం ది కింగ్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









