పాలస్తీనియన్లను రక్షించాలని బహ్రెయిన్ రాజు పిలుపు
- October 18, 2023
బహ్రెయిన్: హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పాలస్తీనా పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి, నిర్బంధించబడిన పౌరుల విడుదల కోసం కృషి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. గాజాకు వైద్య సహాయం, ఆహారం, నీరు మరియు విద్యుత్తు సదుపాయం కోసం అత్యవసర మానవతా కారిడార్లను తెరవాల్సిన అవసరం ఉందని HM రాజు చెప్పారు. న్యాయమైన శాంతి, స్థిరత్వాన్ని సాధించే దిశగా అన్ని ప్రయత్నాల సమన్వయానికి బహ్రెయిన్ రాజ్యం మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. భద్రత, సుస్థిరతను బలోపేతం చేయడానికి మరియు ఈ ప్రాంతంలో శాంతిని పటిష్టం చేయడానికి బహ్రెయిన్ ఆసక్తిని.. పాలస్తీనా సమస్యకు న్యాయమైన పరిష్కారాన్ని కనుగొనడంలో వైఖరిని, పాలస్తీనా ప్రజలకు వారి చట్టబద్ధమైన హక్కులను అందించేందుకు బహ్రెయిన్ కట్టుబడి ఉందన్నారు. ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్లోని ఇటాలియన్ ప్రధాన మంత్రి కార్యాలయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో నిన్న సమావేశమైన సందర్భంగా ఆయన ఈ ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో, వారు రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలతో పాటు వారి ఉమ్మడి ప్రయోజనాలను సాధించే సహకారం, ఉమ్మడి చర్యల యొక్క వివిధ అంశాలను సమీక్షించారు.వారు తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలు మరియు ప్రత్యేకించి గాజా స్ట్రిప్లోని పరిణామాల గురించి కూడా చర్చించారు. అంతర్జాతీయ శాంతి భద్రతల సేవలో అంతర్జాతీయ స్థాయిలో ఇటాలియన్ రిపబ్లిక్ పోషించిన ముఖ్యమైన పాత్రను హెచ్ఎం ది కింగ్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







