ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు..
- October 18, 2023జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈరోజు ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఉన్నట్టుండి ఈ నెల 7న ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు భీకర దాడులకు దిగడం, వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులను ఊచకోత కోయడం తెలిసిందే. అనంతరం గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఉత్తరగాజాలో 10 లక్షల మందిని ఖాళీ చేయాలని ఆదేశించింది. అనంతరం ఉత్తరాగాజలో హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా దాడులను పెంచింది.
అమెరికా అధ్యక్షుడి కీలక పర్యటన ముందు.. గాజాలోని ఓ హాస్పిటల్ పై క్షిపణి దాడి జరగడం, 500 మంది మరణించడం గమనార్హం. దీంతో బైడెన్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి ఇజ్రాయెల్ కారణమని హమాస్, హమాస్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు ఇజ్రాయెల్ ప్రకటించాయి. హమాస్ మిలిటెంట్ల దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ కు సంఘీభావంగా బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చారు. జోర్డాన్ లోనూ బైడెన్ పర్యటించాల్సి ఉండగా, దాన్ని రద్దు చేసుకున్నారు. టెల్ అవీవ్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఆహ్వానం పలికారు.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దంపతులకు బిగ్షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము