సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ
- October 20, 2023
న్యూఢిల్లీ: ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దంటూ తెలంగాణ అధికార పక్షం బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటి గుర్తులు కారు గుర్తును పోలి ఉన్నాయని, దీని వల్ల ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతోందని అదివరకే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన బిఆర్ఎస్ పార్టీ… అదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటి ఎన్నికల గుర్తులను ఎవరికీ కేటాయించకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
బిఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారించింది. సాధారణ ఎన్నికల గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని తాము ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా, ఓటర్లేమీ రోడ్డు రోలర్, చపాతీ మేకర్, కారు గుర్తుకు తేడా తెలుసుకోలేనంత అమాయకులేమీ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







