గర్భిణులకు ఉపవాసం ప్రమాదకరమా?
- May 22, 2016
పవిత్ర రమదాన్ మాసంలో గర్భిణులు ఉపవాసం చేయడాన్ని ఇస్లాం సమర్థించనప్పటికీ, కొందరు మాత్రం రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని భావించి, ఉపవాసం కొనసాగిస్తారు. అయితే డాక్టర్లు గర్భిణీలకు ఉపవాసం చేయరాదనే సూచిస్తున్నారు. పూర్తి ఉపవాసం బిడ్డకు, తల్లికి మంచిది కాదని డాక్టర్లు హెచ్చరించారు. అయితే ఉపవాసం ద్వారా మంచే జరుగుతుందనే నమ్మకం సమాజంలో బలంగా వినవస్తున్నది. ఉపవాసం కొన్నిసార్లు మేలు చేసినా, గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెకు తగిన ఆహారం అవసరం అని ప్రముఖ గౌనకాలజిస్ట్ సలే అల్షాక్లి చెప్పారు. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు తగినంత ఆహారంతోపాటు, నీరు కూడా సమృద్ధిగా తీసుకోవాలనీ, నీటిని సరిగ్గా తీసుకోనప్పుడు మూత్రం సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఒక్కోసారి డీహైడ్రేషన్కి గురై కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె వివరించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి, ఉపవాసం చేయగలిగిన పక్షంలో తగినంత ఆహారం ముందుగానే తీసుకోవడం, అవసరమైతే ద్రవాహారం తీసుకోవడం వంటివి చేయడం ద్వారా పాక్షిక ఉపవాసం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ వహించకపోతే గర్భం దాల్చిన మహిళలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా, ఒక్కోసారి ప్రీమెచ్యూర్ బేబీస్కి జన్మనివ్వడం జరుగుతుందని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







