ఇండియాలో మాజీ బహ్రెయినీ నివాసి హత్య
- May 22, 2016
ఇండియాలోని బెంగళూరులో మాజీ బహ్రెయినీ నివాసితురాలు కిరణ్ సింగ్ హత్య పట్ల ఆమె మాజీ సహచరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గల్ఫ్ ఎయిర్లో క్యాబిన్ క్రూగా 1980లలో కిరణ్ సింగ్ పనిచేశారు. 1983 నుంచి 1988 వరకు కలిసి పనిచేశామని హమీద్ కరిమి, కిరణ్ సింగ్తో తన సాన్నిహిత్యం గురించి చెప్పారు. ఆమె ఎప్పుడూ సరదాగా ఉండేవారని వివరించారు హమీద్ కరిమి. భర్త నుంచి విడాకులు తీసుకున్న కిరణ్ సింగ్ ఢిల్లీ నుంచి బెంగళూరుకి మకాం మార్చారు. అక్కడే ఐదేళ్ళుగా ఆమె నివసిస్తున్నారు. కిచెన్లో ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందడాన్ని ఆమె ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి గుర్తించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎలాంటి దొంగతనం జరిగిన ఆనవాళ్ళు లేకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. వాట్సాప్ మెసేజ్లు, ఆమె ఫోన్లో కాల్ డేటా వంటివాటిపై దృష్టిపెట్టిన పోలీసులు, హత్యకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









