గాజాలో మానవతా కారిడార్ల కోసం UN సెక్రటరీ జనరల్ తో మాట్లాడిన క్రౌన్ ప్రిన్స్
- October 21, 2023
రియాద్: గాజా పౌరుల కోసం మానవతా కారిడార్లను ఏర్పాటు చేయడంలో UN కీలక పాత్ర పోషించాలని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ కోరారు. ఈ మేరకు UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్తో ఫోన్ కాల్లో మాట్లాడారు. గాజాలో కొనసాగుతున్న సైనిక తీవ్రతపై ఈ సందర్భంగా చర్చించారు. సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి, తీవ్రతను తగ్గించడానికి అంతర్జాతీయ -ప్రాంతీయ ప్రయత్నాలను తీవ్రతరం చేయవలసిన అవసరాన్ని క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. క్రౌన్ ప్రిన్స్ ప్రాంతీయ, ప్రపంచ భద్రతపై సంభావ్య ప్రమాదకరమైన పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి ప్రక్రియను పునరుద్ధరించడం ఆవశ్యకతను వివరించారు. పాలస్తీనా ప్రజలు చట్టబద్ధమైన హక్కులను పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు క్రౌన్ ప్రిన్స్ గాజాలో ముట్టడిని ఎదుర్కొంటున్న పౌరులకు అవసరమైన వైద్య సంరక్షణ, ఆహారాన్ని అందించడానికి సురక్షితమైన మానవతా కారిడార్లను అందించడంలో UN మరియు దాని సంస్థల కీలక పాత్ర పోషించాలని కోరారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









