హెచ్సీఏ నూతన అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు
- October 21, 2023
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నూతన అధ్యక్షుడిగా జాతీయ హ్యాండ్బాల్ సంఘం (హెచ్ఏఐ) ప్రధాన కార్యదర్శి అర్శినపల్లి జగన్మోహన్ రావు ఎన్నికయ్యారు. కేవలం ఒకే ఒక్క ఓటుతో ఆయన విజయం సాధించారు. దీంతో ప్రత్యర్థి ప్యానల్కు చెందిన అమర్నాథ్ రీకౌంటింగ్ కోరారు. కాగా.. క్రికెట్ ఫస్ట్ ప్యానల్కి చెందిన సునీల్ అగర్వాల్ హెచ్సీఏ కౌన్సిలర్గా విజయం సాధించారు.
ఈ ప్యానల్కు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ మద్దతిచ్చారు. కాగా ప్యానల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్యానెల్కి చెందిన అన్సార్ అలీకి 47 ఓట్లు పడగా సునీల్ అగర్వాల్కి 59 ఓట్లుపడ్డాయి. దీంతో సునీల్ అగర్వాల్ 12 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్గా దల్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానల్, సెక్రటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానల్), జాయింట్ సెక్రటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానల్), ట్రెజరర్గా సీజే శ్రీనివాస్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ), కౌన్సిలర్గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానల్) విజయం సాధించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







