జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు
- May 23, 2016
అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రోశయ్య మద్రాసు వర్సిటీ అన్నా శత జయంతి స్మారక ఆడిటోరియంలో జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె తమిళంలో ప్రమాణం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ గద్దెనెక్కడం ఇది ఆరోసారి. జయలలితతో పాటు 28మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.2011లో ఇదే వేదిక నుంచే పగ్గాలు చేపట్టిన పురచ్చితలైవి మళ్లీ ప్రజాహిత సుపరిపాలన అందించాలన్న కాంక్షతో ఉన్నారు. జయలలిత ప్రమాణం చేస్తున్న సమయంలో ఆమె మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. ఇక మంత్రివర్గ కూర్పులో భాగంగా పన్నీర్ సెల్వంకు ఆర్థిక శాఖ, తెలుగు వ్యక్తి రాజుకు ఐటీ శాఖను అప్పగించారు. అలాగే 13మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతిపక్ష పార్టీ డీఎంకే నుంచి స్టాలిన్ హాజరు కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ పర్యటనకు వెళ్లడంతో ఆయన తరఫున కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరు అయ్యారు. అలాగే ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు, సినీ ప్రముఖులు విచ్చేశారు. అంతకు ముందు జయలలిత ప్రమాణ స్వీకారానికి పోయెస్ గార్డెన్ నుంచి మద్రాస్ యూనివర్శిటీకి తరలి వస్తున్న సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపుల నిలబడి అమ్మకు ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







