క్షమాపణ చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు

- May 23, 2016 , by Maagulf
క్షమాపణ చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు

 జపాన్‌పై అణుబాంబు దాడికి క్షమాపణ చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా స్పష్టం చేశారు. అణుబాంబు దాడి జరిగిన హిరోషిమా ప్రాంతాన్ని ఒబామా త్వరలో సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జపాన్‌కు చెందిన ఓ మీడియా సంస్థకు ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చారు.అణుదాడికి క్షమాపణ చెబుతారా.. అంటూ ఇంటర్వ్యూలో ఒబామాను ప్రశ్నించగా.. ఒబామా పై విధంగా సమాధానమిచ్చారు. యుద్ధ సమయంలో అప్పటి సందర్భాన్ని బట్టి నేతలు నిర్ణయం తీసుకున్నారని.. దాన్ని ఇప్పుడు తప్పుబట్టలేమని ఒబామా అన్నారు.ఈ వారంలో ఒబామా హిరోషిమాను సందర్శించనున్నారు. ఈ ప్రాంతంలో పర్యటించనున్న మొదటి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. 1945 ఆగస్టు 6న రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్‌లోని హిరోషిమా ప్రాంతంలో జరిపిన అణుబాంబు దాడిలో 1,40,000 మంది చనిపోయారు. ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకీ ప్రాంతంలోనూ అణుబాంబు వేయగా.. అందులో 74వేల మంది మరణించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com