క్షమాపణ చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు
- May 23, 2016
జపాన్పై అణుబాంబు దాడికి క్షమాపణ చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అణుబాంబు దాడి జరిగిన హిరోషిమా ప్రాంతాన్ని ఒబామా త్వరలో సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జపాన్కు చెందిన ఓ మీడియా సంస్థకు ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చారు.అణుదాడికి క్షమాపణ చెబుతారా.. అంటూ ఇంటర్వ్యూలో ఒబామాను ప్రశ్నించగా.. ఒబామా పై విధంగా సమాధానమిచ్చారు. యుద్ధ సమయంలో అప్పటి సందర్భాన్ని బట్టి నేతలు నిర్ణయం తీసుకున్నారని.. దాన్ని ఇప్పుడు తప్పుబట్టలేమని ఒబామా అన్నారు.ఈ వారంలో ఒబామా హిరోషిమాను సందర్శించనున్నారు. ఈ ప్రాంతంలో పర్యటించనున్న మొదటి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. 1945 ఆగస్టు 6న రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్లోని హిరోషిమా ప్రాంతంలో జరిపిన అణుబాంబు దాడిలో 1,40,000 మంది చనిపోయారు. ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకీ ప్రాంతంలోనూ అణుబాంబు వేయగా.. అందులో 74వేల మంది మరణించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







