క్షమాపణ చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు
- May 23, 2016
జపాన్పై అణుబాంబు దాడికి క్షమాపణ చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అణుబాంబు దాడి జరిగిన హిరోషిమా ప్రాంతాన్ని ఒబామా త్వరలో సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జపాన్కు చెందిన ఓ మీడియా సంస్థకు ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చారు.అణుదాడికి క్షమాపణ చెబుతారా.. అంటూ ఇంటర్వ్యూలో ఒబామాను ప్రశ్నించగా.. ఒబామా పై విధంగా సమాధానమిచ్చారు. యుద్ధ సమయంలో అప్పటి సందర్భాన్ని బట్టి నేతలు నిర్ణయం తీసుకున్నారని.. దాన్ని ఇప్పుడు తప్పుబట్టలేమని ఒబామా అన్నారు.ఈ వారంలో ఒబామా హిరోషిమాను సందర్శించనున్నారు. ఈ ప్రాంతంలో పర్యటించనున్న మొదటి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. 1945 ఆగస్టు 6న రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్లోని హిరోషిమా ప్రాంతంలో జరిపిన అణుబాంబు దాడిలో 1,40,000 మంది చనిపోయారు. ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకీ ప్రాంతంలోనూ అణుబాంబు వేయగా.. అందులో 74వేల మంది మరణించారు.
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







