విదేశీ సంస్థల తరలింపునకు జనవరి వరకు గడువు: అల్-జదాన్
- October 27, 2023
రియాద్: సౌదీ అరేబియా తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని రియాద్కు మార్చడానికి జనవరి 2024 వరకు గడువు ఇచ్చినట్టు సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహ్మద్ అల్-జదాన్ ప్రకటించారు. ఏదైనా కంపెనీలు గడువును పాటించడంలో విఫలమైతే, వారు ప్రభుత్వంతో తమ ఒప్పందాలను కోల్పోతారని మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 2021లో సౌదీ అరేబియా జనవరి 1, 2024 నాటికి రాజ్యంలో ప్రాంతీయ ప్రధాన కార్యాలయం లేకుండా కాంట్రాక్టు కంపెనీలతో వ్యవహరించడాన్ని నిలిపివేసే ప్రణాళికలను ప్రకటించింది. సౌదీ విజన్ 2030, రియాద్ కోసం వ్యూహాత్మక ప్రణాళిక లక్ష్యాలలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సౌదీ అరేబియా రాజ్యానికి వెలుపల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలతో ఏదైనా విదేశీ కంపెనీకి లేదా వాణిజ్య సంస్థకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వడం నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం రియాద్లో జరిగిన 7వ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ (FII7) ఫోరమ్లో అల్-జదాన్ పాల్గొని మాట్లాడారు. రాజ్యం చమురుయేతర రంగం అభివృద్ధిపై దృష్టి సారిస్తోందన్నారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







