అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం
- October 28, 2023
తిరుమల: అలిపిరి నడకమార్గాన్ని చిరుతలు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే దాదాపు 7 చిరుతలు బందించి అడవిలో వదిలిపెట్టినప్పటికీ..తాజాగా శుక్రవారం మరో చిరుత కనిపించింది. అలిపిరి నడకమార్గంలో దృశ్యాలను పరిశీలించగా పులి, ఎలుగుబంటి సంచిరిస్తున్నట్టుగా గుర్తించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో వన్యప్రాణులు కనిపించాయి. పులి, ఎలుగుబంటి ఉన్నట్లు నిర్ధారించిన TTD అధికారులు గుంపులుగా తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రికులు నడక మార్గంలో ప్రయాణించరాదని హెచ్చరిస్తున్నారు.
అలిపిరి నడక మార్గంలో నరశింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది భక్తులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. గత మూడు రోజులుగా వేకువ జామున, రాత్రి సమయాలలో చిరుతలు సంచరిస్తున్నట్టుగా గుర్తించారు. గతంలో దాడులు చేసిన ప్రాంతంలోనే రెండు చిరుతల సంచారాన్ని గుర్తించిన సిబ్బంది….భధ్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. నడకదారిలో 24 న రాత్రి 8 గంటల సమయంలో చిరుత సంచారంపై కెమెరా ట్రాప్ లో గుర్తించారు. 10 రోజుల్లో రెండుసార్లు చిరుత సంచారం అందరిలో వణుకుపుట్టిస్తోంది. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తం ఉండాలని సూచించారు అటవీశాఖ అధికారులు.
తాజా వార్తలు
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు









