ఈ-స్కూటర్ రైడర్లపై పెరుగుతున్న ఫిర్యాదులు
- October 29, 2023
దుబాయ్: బ్యాటరీతో నడిచే ఈ-స్కూటర్లు వేలాది మంది ప్రయాణికులకు వరం. చాలా మంది నివాసితులు తమ ఇంటి నుండి కార్యాలయానికి వెళ్లడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ఇ-స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. షేర్డ్ ఇ-స్కూటర్ సేవలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) గత సంవత్సరం ఇ-స్కూటర్ అద్దెకు ఒక మిలియన్ ట్రిప్పులు నమోదయ్యాయని, ఇది 2021లో చేసిన రైడ్ల సంఖ్యను రెట్టింపు చేసిందని మార్చిలో నివేదించింది. భద్రత కోసం నగరం అంతటా ట్రాక్లు, నిర్దేశిత జోన్లు కూడా నియమించబడ్డాయి.
ఇ-స్కూటర్లు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. ఈ-స్కూటర్లు పేవ్మెంట్లు, రోడ్లను అస్తవ్యస్తం చేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. పాదచారులకు, ముఖ్యంగా యువకులు దూకుడు కారణంగా పెద్దలకు ఇ-స్కూటర్ల వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఒకరితో ఒకరు పోటీ పడి ఇ-స్కూటర్ వినియిస్తున్నారని, వీధులలో సిగ్నల్ జంప్ చేస్తున్నారని, కొందరు హెడ్ఫోన్లను ధరించి పరిసరాలను పట్టించుకోకుండా రైడ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అనేకం నమోదు అవుతున్నాయి.
ఇ-స్కూటర్లను బాధ్యతారహితంగా ఉపయోగించడం, రహదారిపై సరికాని ప్రవర్తన కొంతమంది రైడర్ల ప్రాణాలను బలిగొన్నాయి. గత ఎనిమిది నెలలుగా దుబాయ్ అంతటా జరిగిన అనేక ఈ-స్కూటర్ ప్రమాదాల్లో ఐదుగురు మరణించారని, 29 మంది గాయపడ్డారని దుబాయ్ పోలీసులు అక్టోబర్ 24న ప్రకటించారు. రైడర్లు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని అధికారులు గట్టిగా పునరుద్ఘాటించారు. వారు వీధులను చురుకుగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు తప్పు చేసిన రైడర్లపై మొత్తం 10,031 జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ఇ-స్కూటర్ల కారణంగా వారు 32 ప్రమాదాలను కూడా నమోదు చేశారు. అండర్పాస్తో సహా ప్రధాన రహదారులపై ఇ-స్కూటర్లను నడపడం వల్ల కొన్ని సాధారణ ఉల్లంఘనలు జరుగుతాయని దుబాయ్ పోలీసులు చెప్పారు. తమ సొంత లేదా ఇతరుల ప్రాణాలకు అపాయం కలిగించే రైడర్లపై 300 దిర్హామ్ల వరకు జరిమానా విధించబడుతుందని ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి పేర్కొన్నారు. ఇతర ఉల్లంఘనలకు ఇతర సంబంధిత జరిమానాలు కూడా ఉన్నాయన్నారు. ట్రాఫిక్ చట్టాలను గౌరవించాలని, నిర్దేశించిన మార్గాలకు కట్టుబడి ఉండాలని, 60కిమీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లవద్దని, హెల్మెట్లు మరియు రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించాలని, ట్రాఫిక్ లైట్లు మరియు ఇతర రహదారి చిహ్నాలను పాటించాలని రైడర్లకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









