నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బ్రిటన్ పార్లమెంట్ను సందర్శించారు..
- May 24, 2016
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా బ్రిటన్లోని లండన్ నగరాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం భారత సంతతికి చెందిన ఎంపీ, అఖిల పక్ష ఇండో-బ్రిటన్ ఎంపీల చైర్మన్ వీరేంద్ర శర్మ ఆహ్వానం మేరకు పార్లమెంట్ను సందర్శించారు.పార్లమెంటులోని వివిధ విభాగాలను చూపించి, వాటి చరిత్ర గురించి శర్మ వివరించారు. ఎమ్మెల్యే గణేశ్ బిగాల కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ గురించి, రాష్ట్రం సాధించిన విజయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వీరేంద్ర శర్మను తెలంగాణాకు రావాల్సిందిగా ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్శనలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు మహేశ్ బిగాలా, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, తెలంగాణ ఎన్నారైఫోరం-హెడ్ ఆఫ్ అడ్వైసరీ బోర్డు ఉదయ్ నాగరాజు, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ సెక్రటరీ నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







